మంత్రి కేటీఆర్ ఇవాళ(గురువారం) మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్లో మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి.
ఆ తర్వాత ముసాపేట మండలం వేములలోని ప్రైవేటు కంపెనీ యూనిట్కు, మైక్రో రూరల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మణానికి, మహబూబ్నగర్లోని బాలికల ఐటీఐలో శంకుస్థాపన చేయనున్నారు మంత్రి కేటీఆర్. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలోని ఎర్రగుట్టలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.