Saturday, May 4, 2024

నిజామాబాద్ జిల్లాలో చోరీ నింద భరించలేక బాలిక ఆత్మహత్య

spot_img

నిజామాబాద్ జిల్లాలో ఓ బాలిక సూసైడ్ చేసుకుంది.దొంగతనం నింద భరించలేక వందన  ఆత్మహత్యకు పాల్పడింది. నవీపేట మండలం శివతాండకులో ఈ విషాదం జరిగింది. తల్లితో మాట్లాడేందుకు వందన .. పక్కింటి వారి నుంచి ఫోన్ తీసుకుంది. ఫోన్ పౌచ్ లో రూ.600లు దొంగిలించిందని వందన పై.. ఇంటి పక్కన వ్యక్తులు ఆరోపణలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన వందన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles