Friday, May 17, 2024

మహబూబాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

spot_img

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇవాళ (శుక్రవారం) మహబూబాబాద్‌లో పర్యటిస్తున్నారు. మానుకోటలోని  తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్ అండ్‌ నాన్‌వెజ్‌, ఫ్రూట్స్‌, ఫ్లవర్‌ మార్కెట్లను ప్రారంభించారు.

ఆ తర్వాత గుమ్మడూర్‌లో 200 మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్‌, రెడ్యా నాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.

Latest News

More Articles