Friday, May 17, 2024

ఏ పనైనా సరే అడిగిన వెంటనే చేసి పెట్టే నాయకుడు సీఎం కేసీఆర్

spot_img

తరతరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యను కూడా పెద్దమనసుతో తీర్చారని తెలిపారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మీ బాధలను చూసి సీఎం కేసీఆర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపించారు. ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైగా లబ్ధిదారులకు 1,50,000 పైన ఎకరాల భూమికి పట్టాల పంపిణీ చేస్తున్నారు. పట్టాలతో పాటే రైతు బంధు కూడా అందజేస్తున్నాం. ఏ పనైనా సరే అడిగిన వెంటనే చేసి పెట్టే నాయకుడు మన కేసీఆర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన ఎవరికి ఏం కావాలో అందించే తెలంగాణ దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతీ ఒక్కరికి ఏం కావాలో ఆలోచించి.. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోతున్న ధైర్యశాలి మన సీఎం కేసీఆర్ అని అన్నారు.

ఆదివాసీలు జల్,  జంగిల్, జమీన్ అని కొట్లాడితే.. సీఎం కేసీఆర్ నీళ్లు,  నిధులు, నియామకాల కోసం కొట్లాడారని తెలిపారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. 28 రాష్ట్రాల్లో సాధించలేని ప్రగతిని తెలంగాణలో సాధించి ..భారత దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారు సీఎం కేసీఆర్  అని తెలిపారు. ఆయనకు  మనమంతా రుణపడి ఉండాలన్నారు.1,50,000 ఎకరాల భూమిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచిపెడుతున్నారంటే ఈ జిల్లా బిడ్డలంతా అదృష్టవంతులని అన్నారు. గిరిజనుల సీఎం కేసీఆర్ కి ఉన్న ప్రేమను మనం గుర్తించాలన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోకాపేట ప్రాంతాల్లో  ఆదివాసి గిరిజన బిడ్డలకు విలువైన స్థలాలు కేటాయించి..భవనాలను నిర్మించారని తెలిపారు. ఇంతకన్నా గొప్పగా పరిపాలించే నాయకుడు ఎవరున్నారని అన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.

Latest News

More Articles