Friday, May 17, 2024

నెత్తురు బారిన నేల‌లో పుష్క‌లంగా తాగు, సాగునీళ్లు

spot_img

రాజ‌న్న సిరిసిల్ల : నెత్తురు బారిన సిరిసిల్ల నేల‌లో నీళ్లు పారుతున్నాయని, క‌న్నీళ్లు కారిన ఈ నేల‌లో సాగు తాగునీరు పుష్క‌లంగా వ‌స్తున్నాయ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా గోదావ‌రి జ‌లాలు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ను దాటి కూడ‌వెల్లి వాగు ద్వారా మ‌న బీళ్ల‌కు మ‌ళ్లుతున్నాయని పేర్కొన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Also Read.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. సిద్దిపేట గడ్డపై సీఎం కేసీఆర్‌ ఎమోషనల్

‘‘సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌లో కూడా ఊహించ‌ని సంక్షేమం, అభివృద్ధి జ‌రిగింది. కేసీఆర్ పాలనలో అప్ప‌ర్ మానేరు మ‌త్త‌డి దుంకుతున్న‌ది,  సిరిసిల్ల నేత‌న్న‌ల జీవితాలు, బ‌తుకులు మారాయి. ఇవాళ జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ తీసుకొచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌ది. సిరిసిల్ల‌కు అడ‌గ‌కుండానే అన్ని ఇచ్చారు. మా ఆడ‌బిడ్డ‌ల ఆధారాభిమానంతో, అన్న‌ద‌మ్ముళ్ల ఆశీర్వాదంతో త‌ప్ప‌కుండా మ‌ళ్లీ గులాబీ జెండా ఎగుర‌వేస్తాం.’’ అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles