Friday, May 17, 2024

ఇచ్చిన మాట ప్రకారం.. చండూరుకు రేపు మంత్రి కేటీఆర్‌

spot_img

మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో రూ.10కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధ్ది పనులకు ఈ నెల 6న మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావుతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ మునుగోడు నియోజకవర్గం దత్తతలో భాగంగా పలు అభివృద్ధ్ది పనులను ప్రారంభించినట్లు చెప్పా రు. గట్టుప్పల్‌లో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేయనున్న చేనేత క్లస్టర్‌, చండూరులో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.5 కోట్లతో డ్రైనేజీ పనులు, రూ2 కోట్లతో సమీకృతమార్కెట్‌, రూ.50 లక్షలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌, మరో రెండు కోట్లతో మున్సిపల్‌ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వహించనున్న సభాస్థలిని ఆ యన పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తోకల చంద్రకళావెంకన్న, రైతు సేవా సహకార సంఘం అధ్యక్షురాలు కోడి సుష్మావెంకన్న, బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు దశరథ పాల్గొన్నారు.

Latest News

More Articles