Thursday, May 2, 2024

నేడు శ్రీలంక-ఇండియా సెకండ్ టీ20

spot_img

శ్రీలంకతో నేడు రెండో టీ20 లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ టీ20 లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో చివరికి భారత్ నెగ్గింది. ఐతే ప్రధాన బ్యాట్స్ మెన్లు రాణించికపోయినా…దీపక్ హూడా, అక్షర్ పటేల్ చివర్లో మెరుపులు మెరిపించటంతో భారత్ గెలిచింది. రెండో టీ20 లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణిస్తే భారత్ కు తిరుగుండదు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా సారథ్యంలో టీమ్ ఇండియా ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. అటు తృటిలో ఫస్ట్ టీ 20 చేజార్చుకున్న లంక తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరి పుణెలో రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Latest News

More Articles