Sunday, May 19, 2024

రేపే కేటీఆర్ నిజామాబాద్ టూర్.. గులాబీమయమైన ఇందూరు

spot_img

రేపు నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్ ల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత , మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధనలు పాల్గొననున్నారు.

50 కోట్ల నిధులతో చేపట్టిన ఐటీ హబ్ను ప్రారంభిస్తారు అనంతరం న్యాక్ సెంటర్, నూతన మున్సిపాలిటీ భవనం, వైకుంఠధామాలు, మినీ ట్యాంక్ బండ్ లను ప్రారంభిస్తారు.. అనంతరం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు.. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇందూరు గులాబీమయంగా మారింది..

Latest News

More Articles