Monday, May 20, 2024

సుభిక్ష తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన

spot_img

సుభిక్ష తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు మంత్రి  నిరంజన్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక బహుళార్థక మానవ అద్భుతంగా అభివర్ణించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన కృష్ణా జలాలతో అభిషేకం నిర్వహించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన…పాలమూరు చిరకాలవంచ  కృష్ణాజిల్లాలతో భూములను తడుపుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నెరవేరుస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి చూపించామన్నారు. బహుళార్థక మానవ అద్భుతం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అన్నారు. భారతదేశ చిత్రపటంలో ఆకుపచ్చ తెలంగాణ గా శాశ్వత చంద్రభింబంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles