Thursday, May 9, 2024

మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు: నలుగురు తెలంగాణ వాసులు మృతి

spot_img

మహారాష్ట్రలో ఇవాళ(ఆదివారం) ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కు చెందిన ఉద్యోగులు విహారయాత్ర కోసం మహారాష్ట్రలోని చిక్కల్ దరీ కి వెళ్తున్న సమయంలో అమరావతి దగ్గర వారి వాహనం తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు బ్యాంక్ ఉద్యోగులు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. వారంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారన్నారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles