Saturday, May 18, 2024

దేశంలోనే గొప్పగా తెలంగాణ క్రీడా పాలసీ..

spot_img

రంగారెడ్డి: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ క్రీడాకారిని జ్వాలా గుత్తా మొయినాబాద్ అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలలో దేశంలోని 33 రాష్ట్రాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాలా గుత్త, బారత జాతీయ బ్యాట్‎మెంటన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బిస్వా, బ్యాట్‎మెంటన్ అసోషియేషన్ కోశాధికారి వంశీ, శాట్ ఎండీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read Also: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో సమయాల్లో మార్పులు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘దేశంలోనే మహోన్నతంగా తెలంగాణలో క్రీడా పాలసీ రానుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. గతంలో పీవీ సింధు, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించింది. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాఠ్యాంశాలలో ఆటలను భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

Latest News

More Articles