Friday, May 17, 2024

పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పనిచేసి అభివృద్ధి చేయాలి

spot_img

హైదరాబాద్: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ తో మున్సిపల్ ఆఫీసులో సమావేశమయ్యారు. వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు.

Also Read.. మిజోరాం ఎయిర్‌పోర్టులో సైనిక విమానం కూలి 8 మందికి గాయాలు

అలాగే నియోజకవర్గంలోని నాళాల అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని, పార్కులు, గ్రేవీ యార్డులు రోడ్లకు సంబంధించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తెలిపినట్లు పేర్కొన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం ఏదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేమున్నామనే భరోసా కల్పించాలని అన్నారు. దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి పండాల సతీష్ గౌడ్, మందడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబూరావు, మాజీ కార్పొరేటర్ బాబురావు పాల్గొన్నారు.

Latest News

More Articles