Friday, May 3, 2024

ఏసీబీకి పట్టుబడ్డ గ్రామపంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్

spot_img

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 45 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు.

Also Read.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో రివర్స్ కావొచ్చు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇంటి అనుమతి కోసం సెక్రెటరీ లక్ష్మీనరసింహ లంచం డిమాండ్ చేశాడు. అయితే, లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో నర్కుడ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రూ.45వేలు లంచం తీసుకుంటుండగా సెక్రెటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Latest News

More Articles