Saturday, May 18, 2024

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మోసపోతారు

spot_img

హైదరాబాద్: పదేళ్లలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకుపోతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్ తో కలిసి జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో హైదరాబాద్ లో మంచి నీళ్లు, కరెంట్ సమస్య ఉండేదని,  ఇప్పుడు 24 గంటల కరెంట్, నీళ్ల సమస్యలు తీరాయని పేర్కొన్నారు.

Also Read.. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్సై రాజు

సౌదీ నుంచి పదేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చిన మా స్నేహితుడు ఇక్కడి అభివృద్ధి ని చూసి ఆశ్చర్యం పోయాడు. రాష్ట్రం విడిపోయిన సమయంలో శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉందని భయపెట్టారు. కానీ వాటిని దూరం చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో అన్ని సమస్యలు దూరం చేశారు. పేద వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడంతో పాటు గృహ లక్ష్మి ఎంతో మంది పేద వారికి సొంతిల్లు కట్టుకునేలా రూ.3 లక్షలు సాయం అందిస్తున్నామని తెలిపారు.

రాహుల్ గాంధీ వచ్చి ప్యారాచుట్ నాయకులకు టికెట్ ఇవ్వం అని రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన పీజేఆర్ లాంటి నేత కుటుంబం సభ్యులకు మోసం చేశారు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మోసపోతారు. అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.  హైదరాబాద్ లోని అన్ని సీట్లను బీఅర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Latest News

More Articles