Friday, May 17, 2024

సీఎం కేసీఆర్ చిత్రపటానికి కృష్ణా జలాలతో అభిషేకం

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా: ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పాలమూరు రంగారెడ్ది ఎత్తిపోతల పథకం పరిధిలోని వట్టెం శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , కృష్ణా జలాలతో అభిషేకం చేసారు.

ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు బీఆర్ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చి రైతులతో కలిసి ఎమ్మెల్యే డాన్స్ చేసి ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు రైతులు బిఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

Latest News

More Articles