ప్రభుత్వ సంస్థలు మూసివేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. చక్కర కర్మాగారాలను తెరిపిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(శనివారం) జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆమె రోడ్ షో నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా మూసేశారు..పెద్ద పెద్ద కంపెనీలు అమ్మేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూత పడటానికి కారణం బీజేపీ పార్టీ నాయకుడేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించే బాధ్యత తమదేనన్నారు ఎమ్మెల్సీ కవిత.
ఇది కూడా చదవండి: ఎన్నికలు వస్తే ఎవరు మంచి చేశారు అనేది ఆలోచించాలి