Friday, May 17, 2024

ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్.. అధికారుల్లో గుబులు

spot_img

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ క‌స్ట‌డీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. ఏసీబీ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది.హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరైజ్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేపట్టనుంది. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి, వివాదస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. శివబాలకృష్ణను ఏసీబీ విచారించనుండటంతో పలువురు అధికారుల్లో భయం పట్టుకుంది. ఈ విచారణలో తమ పేర్లు ఎక్కడ బయటకువస్తాయొనని భయపడుతున్నారు.

Read Also: తాగుబోతులకు అడ్డాగా మారిన పార్కు.. చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే మర్రి

Latest News

More Articles