మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ రైల్వే ఆర్యూబీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను స్థానిక కార్పొరేటర్ మేకల రామ్ యాదవ్, అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధీ పార్కులో గల పశువైద్యశాలలో సమస్యలను డాక్టర్ స్వాతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్కు తాగుబోతులకు అడ్డాగా మారిందని, నీటి సమస్య కూడా ఉందని, వాచ్మెన్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఇద్దరం మహిళా అధికారులం మాత్రమే ఉన్నామని, అందుకే వెంటనే సెక్యూరిటీ గార్డును నియమించాలని కోరారు. ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించక పోవడం దారుణం