ఏపీలోని కోనసీమ జిల్లా రావులపాలెంలోని గౌతమి కొత్త వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీకి మరమ్మతులు చేస్తుండగా.. మరో టిప్పల్ లారీ వచ్చి ఢీకొన్నది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్పాట్ లో మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.