ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఇవాళ(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఇది కూడా చదవండి: తాగుబోతులకు అడ్డాగా మారిన పార్కు.. చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే మర్రి