Saturday, May 18, 2024

రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

spot_img

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్‌ వికారాబాద్‌  రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు కదిలింది. దీంతో రన్నింగ్‌ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు కొద్ది దూరం అతడిని లాక్కెల్లింది.

గమనించిన సిబ్బంది వెంటనే రైలును ఆపేశారు. రెండు గంటలపాటు శ్రమించి ప్లాట్‌ఫామ్‌ను పగలగొట్టి అతడిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడటంతో గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

Latest News

More Articles