Saturday, May 4, 2024

చంద్రబాబు చెప్పులు మోసినోళ్ళకు..వైయస్ఆర్ బూట్లు నాకినోళ్ళకు పాలనానుభవం ఎట్లా వస్తుంది..!!

spot_img

మేడ్చల్: కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మకై ఓడించారు.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు లాభం జరిగేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నించిదని ఆరోపించారు. తెలంగాణా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కేసులకు, దాడులకు గులాబీ శ్రేణులు భయపడరని, తాము తిరగ బడితే మీ పత్తా దొరకదని వార్నింగ్ ఇచ్చారు. అందరూ వెళ్లి డిల్లీలో తల దాచుకోవలసి వస్తుందని, దాడులతో రెచ్చిపోతే వాళ్ల భరతం పడతామని హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు.

Also Read.. పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

అధికార అహంకారాన్ని తెలంగాణా సమాజం ఉపేక్షించదని, నిజాం నవాబులనే తరిమిన గడ్డ ఇదన్నారు. వాళ్లు ఆంద్రా బాస్ ల వద్ద మొకరిల్లి నప్పుడే మెడలు వంచి తెలంగాణా సాధించామని, ఉడుత ఉపులు,కుక్క అరుపులు తమను ఏమీ చేయలేవన్నారు. తెలంగాణా మాది, మీది కాదని, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కేసీఆర్ దయా దాక్షిణ్యాల తోటే అన్న విషయం మరువొద్దన్నారు. పైసలున్నా కాంగ్రెస్ పాలకులకు పాలన చేత కాదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వారికే పాలనానుభవం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు చెప్పులు మోసినోళ్ళకు, వైయస్ఆర్ బూట్లు నాకినోళ్ళకు పాలనానుభవం ఎట్లా వస్తుందని ప్రశ్నించారు. అప్పులు చెయ్యమన్నదే కాంగ్రెస్ నేతలు అని, అప్పులు లేకుంటా అభివృద్ధి జరగదని, ఆదానీ,అంబానీ లకే అప్పులు తప్పలేదన్నారు. డిసెంబర్ 9 న రుణమాఫీ అన్న సన్నాసులు, ఇప్పటివరకు దానిగురించి ఎందుకు మాట్లాడం లేదని మండిపడ్డారు.

Also Read.. ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉంది.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు విసుర్లు

Latest News

More Articles