Friday, May 17, 2024

జేబులో ఉండగానే పేలిపోయిన ఫోన్

spot_img

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సెల్ ఫోన్ పేలింది. 70 ఏళ్ల ఓ వ్యక్తి హోటల్లో కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. అదే సమయంలో.. ఆయన జేబులో  ఉన్న సెల్ ఫోన్ .. ఉన్నట్టుండి పేలిపోయి మంటలు వచ్చాయి. వెంటనే ఆయన రెండు చేతులతో దులిపేసుకోవడంతో సెల్ ఫోన్ కింద పడిపోయింది. జేబు ప్రాంతంలో చొక్కా కాలిపోయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి నీళ్లు చల్లి సెల్ ఫోన్ మంటను ఆర్పేశాడు.  వెంటనే అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పినట్టయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు..సెల్ ఫోన్ పేలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.

Latest News

More Articles