Thursday, May 2, 2024

111 జీవో ఎత్తివేత: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

spot_img

రంగారెడ్డి జిల్లా: నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల శంషాబాద్ మండలం బీఆర్ఎస్ నేతలు హర్ష వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్  మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసం వద్ద శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం, సంబరాలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో అభివృద్ధికి 111జీఓ ఆటంకంగా మారిందని తెలిపారు. 111 జీఓ ద్వారా 84 గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. హిమాయత్ సాగర్ గండిపేట జలాశయాలు కలుషితం కాకుండా కాలేశ్వరం జలలతో అనుసంధానం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. 111జీఓ ప్రాంతంలోని రహదారుల విస్తరణ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు.

Latest News

More Articles