Saturday, May 18, 2024

భూ తగాదాలలో ఓ వర్గంపై మరో వర్గం దాడి.. ముగ్గురి మృతి

spot_img

భూ తగాదాలకు ఓ మహిళతో సహా ముగ్గురు బలయ్యారు. కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బన మండలం జక్కులపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దాంతో ఓ వర్గంపై ప్రత్యర్థి వర్గం గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. మృతులను మండల లింగయ్య, మండల నరసయ్య, గిరుగుల బక్కమ్మగా గుర్తించారు. ఘటనలో మండల సంతోష్‌, మండల దుర్గయ్య గాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో జక్కులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో ఈ ఘర్షణ జరిగిందని, ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. దాడిలో దాదాపు 15 మంది కలిసి ఓ వర్గంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Latest News

More Articles