హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం నిర్మించిన నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి నీరా కేఫ్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నీరా కేఫ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి.. ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను మే 3వ తేదీన రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గారి చేతులమీదుగా ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ ఎండి మనోహర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/snfjiVeC8Z
— V Srinivas Goud (@VSrinivasGoud) April 30, 2023