Tuesday, May 14, 2024

అక్రమాల నుండి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నారు

spot_img

ఆకాల వర్షాలు ,వడగండ్లతో ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రత పై అంచనా వెయ్యలేదని.. కనీసం రైతులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన పల్లా…40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం పంట నష్టంపై  అంచనా వెయ్యలేదనీ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా హయంలో ఆకాల వర్షాలకు పంట నష్టం జరిగితే బోనకల్లు వెళ్లి పంట నష్ట అంచనా వేసి… నష్ట పోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి 10,000 రూపాయలు ఎకరాకు ఇచ్చాం. ఆనాడు మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం జరిగితే మేమే స్వయంగా వెళ్లి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఆనాడు మేము పంట నష్ట పోయిన రైతులకు డబ్బులు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసి… రైతుల అకౌంట్స్ లో డబ్బులు వెయ్యకుండా అడ్డుకున్నారు.మీకు చిత్తశుద్ది ఉంటే ఏంటనే ఆ డబ్బులను రిలీజ్ చేసి రైతుల అకౌంట్స్ లో వెయ్యాలన్నారు.

రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం 7500 కోట్లు రూపాయలు సిద్ధం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుల అకౌంట్స్ లో పడకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఇవాళ ఆ డబ్బులు ఎవరు వాడుకున్నారో తెలుసు…వాళ్ళు రాష్ట్ర మంత్రి వర్గం లోనే ఉన్నారు. 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన డబ్బులు ఎక్కడకి పోయాయి , ఇంత వరకు రైతు బంధు అందరికీ పడలేదు. మంత్రి కాకున్నా, ఎమ్మెల్యే కాకున్నా తుమ్మల నాగేశ్వరరావుని కేసీఆర్ హెలికాప్టర్ లో ఎక్కించుకొని బోనకల్లు తీసుకోని వెళ్ళింది నిజమా కాదా! తుమ్మల నాగేశ్వరరావే చెప్పాలని డిమాండ్ చేశారు. అపర భగీరథుడనీ కేసీఆర్ ను పొగిడింది నిజం కాదా! అని ప్రశ్నించారు.

56 లక్షలకు పైగా ఎకరాలకు నీరు ఇచ్చి పంటలు పండించిన ఘనత కేసీఆర్ దన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతులను ముంచకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చెయ్యాలన్నారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 న రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారు.. చిత్తశుద్ది ఉంటే ఏంటనే 2లక్షల రుణమాఫి చెయ్యాలన్నారు. కేసీఆర్ హయంలో రైతులు అత్యధికంగా వరి, మిర్చి పండించారు. పత్తి విషయం లోనూ మూడో స్థానానికి చేరుకున్నాం. ఇవాళ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని తెలిపారు. దొంగ కరెంట్ ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. మా హయంలో ఎండాకాలంలో సాగు నీళ్ళు ఇచ్చాం, సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్ళను ఎందుకు ఎత్తడం లేదని అన్నారు. మా హయంలో మంచినీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చాం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందీ, ఎందుకు సాగు నీరు, తాగు నీరు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఒక పార్టీలో గెలిచి మరోక పార్టీలోకీ వెళ్ళడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి వెళ్తున్న నేతలను ప్రజలే చీ కొడుతరు, చెప్పులతో కొడుతరని అన్నారు. అక్రమాల నుండి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు.వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీయే బయట పెడుతుందని స్పష్టం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఇది కూడా చదవండి: తెలియని పెళ్లికి వెళ్లి భోజనం చేస్తే ఈ సెక్షన్ తో ఇక పై జైలుకే!

Latest News

More Articles