రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ నామా.. కవితను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. గతంలో శివసేన పార్టీపై కూడా బీజేపీ కుట్రలు చేసి, పార్టీని విచ్ఛిన్నం చేసిందన్నారు. బీజేపీ తన పాలసీలను ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్చుకున్నారు. కవితను ఒక్క మహిళ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారన్నారు. కవితమ్మ అరెస్ట్ దురదృష్టకరమని…ప్రజాస్వామ్యం లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
గత పదేండ్లలో కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రైతుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని తాను కోరుతున్నాను. రానున్న రోజుల్లో తమ పార్టీకి న్యాయం జరుగుతుందన్న సంపూర్ణ నమ్మకం ఉందనన్నారు ఎంపీ నామా నాగేశ్వర్ రావు.
ఇది కూడా చదవండి: తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు: చుక్కలు చూపించిన తల్లీకూతుళ్లు