హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన నిన్న(శనివారం) అర్ధరాత్రి జరిగింది. ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్గా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారును ఎవరైనా తగలబెట్టారా? ప్రమాదమా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:ఎన్నికల అంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు