Wednesday, May 22, 2024

దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్‌

spot_img

సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానంపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. అయితే స్పీకర్ నుంచి స్పందన రాలేదని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి.

దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని బీఆర్ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు.

ఇది కూడా చదవండి: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్

Latest News

More Articles