Wednesday, May 1, 2024

పవన్ కల్యాణ్ కు ఈసీ నోటీసులు

spot_img

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ(బుధవారం) పవన్ కు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జనసేన  అనకాపల్లి వారాహి యాత్ర లో సీఎం జగన్ ను ఉద్దేశించి సారా వ్యాపారి, స్కాం స్టార్, లాండ్ గ్రాబర్ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్‌ 8న విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిచారని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో… తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది.

అయితే ఏపీలో ముఖ్య నేతలకు ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరికీ ఈసీ నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో జరుగుతోంది ప్రజా పాలన కాదు…నయవంచన పాలన

Latest News

More Articles