ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయల్దేరారు. ఈ క్రమంలో కస్గంజ్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: గుండెపోటుతో మైదానంలో కన్నుమూసిన కర్ణాటక మాజీ క్రికెటర్