ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోవడంతో ఫోన్ చేసేది ఎవరో తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్’ లాంటి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు మొబైల్ వినియోదారులు. అయితే.. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ..యాప్స్ తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలుకానుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రెండేళ్ల క్రితం చేసిన ప్రతిపాదన అమల్లోకి రానుంది. ఇప్పుడు దీనిని తప్పనిసరి చేసింది.
వినియోగదారుల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ సర్వీస్గా అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్లో ప్రతిపాదించింది. అయితే, ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్ గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్కార్డు తీసుకున్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థన పై మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: రూ.500కే గ్యాస్ సిలిండర్.. మొదట మొత్తం ధర చెల్లించాల్సిందే