తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.ఇప్పటి వరకు సరైన పేపర్లు లేకుండా తరలిస్తున్న నగదును భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. లేటెస్టుగా ఇవాళ(సోమవారం) జనగామ జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్ ప్లాజా దగ్గర 5.4 కిలోల గోల్డ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత