Friday, May 3, 2024

హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

spot_img

హైద‌రాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, సీఎం రేవంత్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ ర‌వి గుప్తాతో పాటు ప‌లువురు స్వాగ‌తం ప‌లికారు.

హైద‌రాబాద్‌కు చేరుకున్న ద్రౌప‌ది ముర్ము బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఉండనున్నారు. ఐదు రోజుల విడిది అనంతరం 23న తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక్కడున్న సమయంలో రాష్ట్రపతి పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

Latest News

More Articles