Friday, May 3, 2024

బస్సులు లేక.. మహిళలు, విద్యార్థినుల అవస్థలు!

spot_img

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బస్సులు లేక మహిళలు, కళాశాల విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో..ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నట్లు పలువురు తెలిపారు.

rush buses1

సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణించడం నిత్యకృత్యంగా మారింది. తాజాగా బస్సులు లేవని కళాశాల విద్యార్థినులు రోదించడం పలువురిని కదిలిందింది. దీంతో కాసేపు బస్సును డ్రైవర్ నిలిపారు. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్య పెంచాలని మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Latest News

More Articles