Friday, May 3, 2024

ఆత్మహత్య చేసుకున్న బి ఫార్మసీ స్టూడెంట్!

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా: చారకొండ మండల కేంద్రంలో అనూష (23)అనే యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాదులోని శ్రీ ఇందూ కాలేజీలో బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నది అనూష. నిన్న ఆదివారం కావడంతో తన స్వగ్రామం చారకొండకు వచ్చింది.

సోమవారం తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. తోటి అమ్మాయిల వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ అనూష తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles