Saturday, May 18, 2024

శ్రీధర్ బాబుపై పుట్ట మధు ఫిర్యాదు

spot_img

పెద్దపల్లి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడంతో ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు. కాంగ్రెస్ పార్టీలో రౌడీ షీటర్లు, మాజీ నక్సలైట్లు, దొంగలతో శ్రీధర్ బాబు దాడులు చేపిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Also Read.. గుండాయిజం, రౌడీయిజం చేసే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలి

ఓడేడ్ సర్పంచ్ బక్కరావు మహాముత్తారం వెళ్ళడానికి కారణం ఏమిటి? మా నాయకులు అడిగితే కత్తులతో దాడులా?మళ్ళీ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన కోరారు.

Latest News

More Articles