Saturday, May 18, 2024

గుండాయిజం, రౌడీయిజం చేసే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలి

spot_img

నిజామాబాద్:  బోధన్ లో ఎమ్మేల్యే షకీల్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ కవిత. అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదన్నారు. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నయని, రౌడీల్లా గుండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కోరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

Also Read.. నేను కోరుకున్న బంగారు తెలంగాణ అదే.. అదే ఆకాంక్షతో పనిచేస్తున్నం.. సీఎం కేసీఆర్

అధికారంలో ఉన్న ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది. 1972 నుండి 1990 వరకు తెలంగాణ వ్యాప్తంగా రక రకాల అల్లర్లు సృష్టించారు. 113 రోజులపాటు కర్ఫ్యూ విధించారు. బిఅర్ఎస్ పార్టీ జిల్లాలకు ఐటీని విస్తరిస్తే.. కాంగ్రెస్ అల్లర్లను విస్తరిస్తుందని మండిపడ్డారు. నిజాయితిగా ఉద్యోగాలు చేస్తున్న పోలీసులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారు. గుండాయిజం, రౌడియిజం చేసేవాళ్లకు ప్రజలు బుద్ది చెప్పాలి. బిసి టికెట్ల ను అమ్ముకున్న రేవంత్ రెడ్డి బిసిల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 2లక్షల 32 వేల ఉద్యోగాలు తెలంగాణలో ఇప్పటి వరకు ఇచ్చుకున్నాము. కాంగ్రెస్ వాళ్లు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Also Read.. కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు ఖాయం

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వల్ల అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అస్థిరత పాలన ఉంది. కర్ణాటకలో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని మాట తప్పారు. కేసీఆర్ కోరుకున్నట్లు మన బిడ్డలు డాక్టర్లు, సైంటిస్టులు కావల్నా లేదా బిజెపి కాంగ్రెస్ లు కోరినట్లు నక్సలైట్లు లేదా పకొడీలు వేసుకునే వారు కవాల్నా ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు నీరు ఇస్తున్న వ్యక్తి కేసీఆర్. నిజాంసాగర్ ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నాం. దీంతో నిజామాబాద్ లో సాగు మూడు ఇంతలు పెరిగిందన్నారు.

Latest News

More Articles