Saturday, May 4, 2024

కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు ఖాయం

spot_img

కరీంనగర్‌ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని కరీంనగర్‌ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని హెచ్చరించారు. కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఓటుకు ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధమైన బండి సంజయ్ వద్ద డబ్బును తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

దొంగకు టికెట్ అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని.. కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కరెంటు కోతలు తప్పవని హెచ్చరించారు. కొత్తపల్లిలో నిర్మించే మెడికల్ కాలేజీలో యాభై శాతం ఉద్యోగాలు స్థానిక కొత్తపల్లి వారికే ఇస్తామని మంత్రి గంగుల పేర్కొన్నారు.

Latest News

More Articles