Sunday, May 12, 2024

మున్సిపల్ చైర్మన్‏ను చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్

spot_img

గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మున్సిపల్ చైర్మన్‏ను మహిళా కౌన్సిలర్ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని మేర్టా మున్సిపల్‌ సమావేశంలో జరిగింది. ఈ రోజు 2024-25 నగర బడ్జెట్‌ ఆమోదం కోసం చైర్మన్‌ గౌతమ్‌ తాక్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గౌతమ్‌ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ మద్దతుతో గెలిచిన శోభా లహోటీ అనే మహిళా కౌన్సిలర్‌ చైర్మన్‌పై చెప్పులు విసిరారు. బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్‌.. గౌతమ్‌ మీదకు పూల దండ విసిరేశాడు. అంతటితో ఆగని సభ్యులు తమ ముందున్న ఫైళ్లను ఆయనపై విసిరి, చైర్మన్‌పై భౌతికదాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది. అనంతరం సమావేశం వాయిదాపడింది. అయితే ఈ గొడవ జరిగిన సమయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్‌ రామ్‌ అక్కడే ఉండి కూడా కౌన్సిలర్లను అదుపు చేయకపోవడం గమనార్హం.

Read Also: న్యూజిలాండ్ క్రికెట్‌లో కరోనా కేసులు

Latest News

More Articles