Friday, May 17, 2024

మణిపూర్‌లో మళ్లీ హింస… నలుగురు మృతి

spot_img

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. మరోసారి సాయుధ మూకలు రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి కాల్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి ఈ దుండగులు పారిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే, మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కంగ్​పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు తెలిపారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్​చుప్ గ్రామంపై దాడి చేశారు. దీంతో గ్రామస్థులు కూడా ప్రతిదాడులు చేశారని తెలిపారు. వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్​లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు.

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌లో కరోనా కేసులు

Latest News

More Articles