Saturday, May 11, 2024

బ్రోకర్ దందాలు చేసి సీఎం అయ్యావ్.. ఖబర్దార్ రేవంత్ రెడ్డి

spot_img

ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టన బెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు మాజీమంత్రి జోగురామన్న. నిన్న జరిగిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభలో జోగురామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ కు కేసీఆర్ హయంలోనే నిదులొచ్చాయి. 220 కి పైగా తండాలు గూడేలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. జోడేఘాట్ ను 22 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసింది కేసీఆర్ కాదా. కేసీఆర్ సీఎం కాక ముందు అక్కడకు వెళ్లే పరిస్థితి లేకుండే. గిరి వికాసం కింద 3 వేలకు పైగా ఉచిత్ వ్యవసాయ బోర్ల ను గిరిజనులకు అందజేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కొత్తగా జిల్లాలు మండలాలు మున్సిపాలిటీ లు రెవెన్యూ డివిజన్లు చేయడం వల్ల ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లా స్వరూపం మారిపోయింది.

కేసీఆర్ హయాంలో 13 మధ్యతరహా ప్రాజెక్టులను 800 కోట్ల రూపాయలతో పూర్తి చేశాము. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏనాడు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అధికారుల దగ్గర వివరాలు తెప్పించుకుని వాస్తవాలు మాట్లాడాలి ..పార్టీ నాయకుడిగా మాట్లాడొద్దు. చనాకా కొరటా ప్రాజెక్టును గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు ను పట్టించుకుంది. రేవంత్ పిచ్చిగా మాట్లాడొద్దు. కేవలం పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది కోసమే రేవంత్ ప్రచారానికి వచ్చారు ..జిల్లా పై ప్రేమ తో కాదు. ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి ..ఓటుకి నోటుకు దొంగవి నీవు. రేవంత్ ఎంపీల అమ్మకం గురించి మాట్లాడటమా. ముందు నువ్వు వీపు చూసుకుని మాట్లాడు రేవంత్. బ్రోకర్ దందాలు చేసి రేవంత్ సీఎం కావడం ప్రజలు దురదృష్టం. కేసీఆర్ కుటుంబం పై మాట్లాడితే సహించేది లేదు అన్నారు.

Latest News

More Articles