Sunday, May 19, 2024

హైదరాబాద్‎కు తరలిస్తున్న రూ. 11 లక్షల విలువైన గంజాయి

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. మణుగూరులో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ. 11 లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ఈ గంజాయిని మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ దూల్ పేటకు తరలిస్తున్నట్టు తెలిసింది. పక్కా సమాచారం అందడంతోనే తనిఖీలు చేపట్టామని తెలిపిన ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Latest News

More Articles