Saturday, May 4, 2024

శంషాబాద్‎లో రూ. 29 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

spot_img

పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా కూడా స్మగ్లర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ వద్ద ఎస్వోటీ, స్థానిక పోలీసులు ఆదివారం ఉదయం జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒరిస్సా నుండి బెంగుళూరుకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. అందులో 102 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహేంద్ర స్కార్పియో వాహనంలో ఒరిస్సా నుండి బెంగుళూరు గంజాయి తరలిస్తున్నారనే పక్క సమాచారంతోనే పోలీసులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 29 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Read Also: దసరా బంపర్ ఆఫర్.. రూ. 10లకే పట్టుచీర

Latest News

More Articles