ఈ 27న మధ్యహ్నం 2 గంటలకు మహబూబాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేపథ్యంలో సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ ఛైర్మెన్ బిందు.
సభా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మాట్లాడిన మంత్రి ఎర్రబెల్ల..రాహుల్ సభకు ప్రజలు రాలేదు కాబట్టే రోడ్ షోలు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కేంద్రం అనేక అవరోధాలు సృష్టించిన రాష్ట్ర ప్రగతిని ఆపని గొప్ప సీఎం కేసీఆర్. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్, రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడని విమర్శించారు.
27న మహబూబాబాద్ లో జరిగే సీఎం కేసీఆర్ సభను 70 వేల మందితో నిర్వహిస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్ . సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్,బీజేపీకి పార్టీలకు ఇంకా అభ్యర్థులు దొరకడం లేదని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.
ఇది కూడా చదవండి: దసరా బంపర్ ఆఫర్.. రూ. 10లకే పట్టుచీర