వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం జరిగింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి కిష్టాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి చెందారు. మొరిపిరాలకు చెందిన వెంకన్న.. పండుగకు కూరుతు, అల్లుడిని తన బైక్పై ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కిష్టాపురం సమీపంలో వారి బైక్ని కారు ఢీకొట్టింది. దీంతో వెంకన్న, ఆయన కూతురు అనూష అక్కడికక్కడే మృతిచెందారు. అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: రూ. 15 కోసం టీ షాప్ ఓనర్ని చంపిన యువకులు