Monday, May 13, 2024

రూ. 500 నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్ట్‌

spot_img

హైదరాబాద్ లోరూ.500ల నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టయింది. సైబరాబాద్‌ బాలానగర్‌ పోలీసులు, అల్లపూర్‌ పోలీసులతో కలిసి ఇద్దరు అనుమానితులను పట్టుకుని.. వారి దగ్గర నుంచి రూ.4లక్షల విలువగల 500 నకిలీ రూపాయల నోట్లు సీజ్‌ చేశారు.

వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ రూ.500 నోట్లను ప్రింట్ చేస్తున్నారని…10 అసలు నోట్లను ఇస్తే 40 నకిలీ ఇస్తామని (1:4 రేష్యో) కొందరు వ్యక్తులను సంప్రదించారన్నారు. ఈ విషయం తెలియడంతో సైబరాబాద్‌ బాలానగర్‌ పోలీసులు, అల్లపూర్‌ పోలీసులతో కలిసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారిని విచారించి వారి వద్ద నుంచి రూ.4లక్షల విలువగల 500 నకిలీ రూపాయల నోట్లు సీజ్‌ చేశామని.. నకిలీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న 2 ప్రింటర్లు, పేపర్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

ఇది కూడా చదవండి: సీఎం, మంత్రులు కారుకూతలు బంద్ చేయాలి

Latest News

More Articles