Saturday, May 4, 2024

ఆర్టీసీ డ్రైవ‌ర్ ను అధికారులు వేధించలేదు

spot_img

అధికారులు తనకు సెలవు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్‌కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

అలాగే డ్రైవర్ శంకర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారు.

సెలవు ఇవ్వబోమని చెప్పలేదని అన్నారు. తనకు సెలవు మంజూరు చేయకుండా అధికారులు వేధిస్తున్నారని, పురుగుల మందు తాగుతున్ననంటూ ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్ ల్లో శనివారం శంకర్ షేర్ చేశాడు. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగ లేదని డాక్టర్లు కన్ఫాం చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ తన ఇంటి దగ్గర సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. గతంలో సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగినట్లు తమకు సమాచారం అందిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి

Latest News

More Articles