Saturday, May 4, 2024

గుజరాత్ లో సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం

spot_img

గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. సూరత్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సూరత్ లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించడం, మిగతా 8మంది ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో ముఖేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా, గుజరాత్ లో మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. సూరత్ ఎంపీ స్థానంలో బీజేపీ తరఫున ముఖేశ్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేశ్ కుంభానీ బరిలో దిగారు. ఆయనకు సబ్ స్టిట్యూట్ గా సురేశ్ పడ్సాలాను కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంచింది. అయితే వివిధ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు రద్దయ్యాయి. దాంతో, బీజేపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయింది.

సూరత్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకగ్రీవం కావడంపై రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్థీ ఫోన్ ద్వారా స్పందించారు. “విజయవంతంగా నామినేషన్లు దాఖలు చేసిన ఎనిమిది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో దలాల్ ఎలాంటి పోటీ లేకుండా ఎంపీగా ఎన్నికయ్యారు” అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సూరత్ ఎంపీ స్థానం నుంచి నీలేశ్ కుంభానీని బరిలో దించింది. అయితే నీలేశ్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదకుల సంతకాల్లో తేడాలు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ ను తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా బరిలో ఉన్న సురేశ్ పడ్సాలాకు కూడా నిరాశ తప్పలేదు. ఆయన నామినేషన్ ను కూడా అధికారులు తిరస్కరించారు.

ఇది కూడా చదవండి: అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి

Latest News

More Articles